రేపు కాంట్రాక్టు ఏఎన్ఎంల చలో హైదరాబాద్

రేపు కాంట్రాక్టు ఏఎన్ఎంల చలో హైదరాబాద్

హైదరాబాద్, వెలుగు: తమను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్​తో  వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఏఎన్ఎంలు ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నిరసన కార్యక్రమం శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ. ఫసియుద్దీన్, , కార్యదర్శి కె. యాదనాయక్ తెలిపారు. 

గత నెల 15 నుంచే రాష్ట్రవ్యాప్తంగా తమ సమ్మె కొనసాగుతున్నదని  గుర్తుచేశారు. ప్రభుత్వంతో మూడుసార్లు చర్చలు జరిగినా, రెగ్యులరైజ్​పై స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీసుల పేరుతో కాంట్రాక్టు ఏఎన్ఎంలను బెదిరించడం దుర్మార్గమని వెల్లడించారు. శనివారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.