దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. కొత్త కేసులు రెండు లక్షల లోపునే నమోదు కావడం ఊరట కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 14 లక్షల మందికి పరీక్షలు చేయగా 1,67,059 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అంతకు ముందు రోజుతో పోలిస్తే 20శాతం తగ్గుదల నమోదు అయింది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 2 లక్షల 54వేల మంద కరోనా నుంచి కోలుకోగా.. 1192 మంది చనిపోయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

 ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 17,43,059కు చేరగా.. రోజువారీ పాజిటివీటి రేటు 11.69 శాతం, దేశ వ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 94 శాతం నమోదు అయింది. నిన్న ఒక్కరోజే 61 లక్షల మంది టీకాలు తీసుకోగా.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 16,66,84,820 మంది టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.