వాటిని బుక్ చేసిన వారిపై కూడా..
నిబంధనలు ఉల్లంఘించినందుకే
నిర్మల్, వెలుగు: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు పెండ్లి మండపాలపై కేసులు నమోదయ్యాయి. వాటిని బుక్ చేసిన వారిపై కూడా కేసులు నమోదయ్యాయి. పెండ్లి సందర్భంగా మ్యారేజ్ హాల్లో 200 మందికి మించి ఉండొద్దని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ.. నిర్మల్ జిల్లాలో శుక్రవారం జరిగిన వేర్వేరు పెండ్లి వేడుకల్లో ఆ నిబంధనలను పాటించలేదు. 200 మందికిపైగా జనం పెండ్లికి రావడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. నిర్మల్ పట్టణంలోని సాగర్ కన్వెన్షన్, రాజరాజేశ్వర్ ఫంక్షన్ హాల్, ఆర్ఆర్ గార్డెన్, ఖానాపూర్లోని ఏఎంకే ఫంక్షన్ హాల్ యజమానులపై, ఆయా మండపాలను బుక్ చేసిన పెండ్లికొడుకు, పెండ్లికూతురు తరఫు వారిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ జాన్ దివాకర్ తెలిపారు.