కిరాయికుండేటోళ్లకు క‌రోనా క‌ష్టాలు

కిరాయికుండేటోళ్లకు క‌రోనా క‌ష్టాలు

నల్లగొండకు చెందిన రాము మెడికల్ రిప్. దిల్సుఖ్నగర్లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. డ్యూటీలో భాగంగా పలు హాస్పిటల్స్కు వెళ్లాల్సి ఉంటుంది. డైలీ బయటకు తిరిగేట్ల యితే ఇండ్లు ఖాళీ చేయండని ఓనర్ చెప్ప డంతో ఇప్పుడు అయోమయంలో పడ్డాడు. బ్యాకింగ్ సంస్థలకు ఐటీ సేవలందించే కంపెనీలో పని చేస్తోంది స్వాతి. ఆమె పని చేసే కంపెనీ బిల్డింగ్లో మరో సంస్థ ఎంప్లాయ్కి కరోనా పాజిటి వ్ వచ్చింది. అప్పటి నుంచి స్వాతికి ఇంటి ఓనర్ నుంచి రెస్ట్రిక్షన్స్ ఎక్కువయ్యాయి. కారిడార్ లోనూ తిరగనివ్వడం లేదని ఆమె వాపోయింది.

విద్యానగర్లో ఉండే రచన దంపతులు తమ కూతురు ఫస్ట్ బర్త్ డేను ఫ్యామిలీ మెంబర్స్ మధ్యే అపార్ట్మెంట్ టెర్రస్పై జరుపుకొనేందుకు రెడీ అయ్యారు. ఫ్లాట్స్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు వచ్చి పార్టీల్లాంటివి ఇక్కడ చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ చేస్తే ఫ్లాట్ ఖాళీ చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.

హైదరాబాద్, వెలుగు : కరోనా కేసులు పెరుగుతున్న కొద్దీ సిటిజన్స్లో భయాందోళనలు ఎక్కువతున్నాయి. అద్దెకున్నోళ్లకు ఓనర్లు రూల్స్, రెస్ట్రిక్షన్స్ మామూలే అయినా.. ఇప్పుడవి ఎక్కువయ్యాయి. వారికి ఎదురు చెప్పలేక, ఇండ్లు ఖాళీ చేసే పరిస్థితి లేక టెనెంట్స్ మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్లో 70 శాతం మంది ఉపాధి కోసం వచ్చి అద్దె ఇండ్లల్లో ఉంటున్నవాళ్లే. ఓనర్లు బయటకు వెళ్లొద్దని చెప్తున్నా, ఉద్యోగానికి వెళ్తే తప్ప కుటుంబం గడవదని కిరాయిదారులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కరోనా సింప్టమ్స్ కనిపిస్తే ఇండ్లు ఖాళీ చేయించే అవకాశాలున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఇదే సమస్యపై ఇటీవల గాంధీనగర్లని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఓనర్ల మధ్య గొడవ జరిగి, పోలీసుల వరకూ వెళ్లింది. గేటెడ్ కమ్యూనిటీల్లో కమిటీలు పెడుతున్న రూల్స్ మరింత ఇబ్బందికరంగా ఉంటున్నాయని, కమిటీ సభ్యుల మాటలు మానసికంగా వేధిస్తున్నాయని మణికొండలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

ఎటుచూసినా టు లెట్ బోర్డులే..

వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లిపోయేవారి సంఖ్య కూడా పెరిగింది. ఓనర్ల సూటిపోటి మాటలు, వేలకు వేల అద్దెలతో ఇబ్బంది పడే కంటే సొంతూరుకు వెళ్లడం బెటర్ అనుకుంటున్న వాళ్లూ ఎక్కువవయ్యారు. ఆఫీసుకు వెళ్లేట్లయితే ఇండ్లు ఖాళీ చేయండని ఓనర్ సతాయించడంతో తాను వరంగల్కు ఫ్యామిలీ షిఫ్ట్ చేసినట్లు బాలానగర్లో ఉండే మహేందర్ తెలిపాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ట్రై చేస్తున్నానని, అది లేకుంటే వేరొక పని చూసుకుంటానని చెప్పుకొచ్చాడు. వలస కూలీలు ఎక్కువగా ఉండే తమ ఏరియాలో ఇప్పుడు ఎటుచూసినా టు లెట్ బోర్డులు కనిపిస్తున్నాయన్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి