హెల్త్ వర్కర్లతో మొదలు.. విడతల వారీగా అందరికీ
తొలిరోజు వ్యాక్సినేషన్
దేశవ్యాప్తం గా 3 లక్షల మందికి
రాష్ట్రంలో 4,200 మందికి
ఫస్ట్ ఫేజ్ లో ఎవరికి?
హెల్త్, ఐసీడీఎస్ వర్కర్లు తర్వాత మిగతా ఫ్రంట్ లైన్ వర్కర్లకు
న్యూఢిల్లీ: కరోనాపై యుద్ధానికి వ్యాక్సిన్తో దేశం సిద్ధమైంది. ‘కొవిషీల్డ్’, ‘కొవాగ్జిన్’ టీకాల డ్రైవ్ శనివారం నుంచి మొదలు కానుంది. రాష్ట్రంలో కూడా కరోనా వ్యాక్సినేషన్కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. దేశవ్యాప్తంగా మూడు, నాలుగు నెలల్లో 30 కోట్ల మందికి టీకా వేయాలని కేంద్రం టార్గెట్గా పెట్టుకుంది. విడతల వారీగా దేశప్రజలందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది. కరోనా టీకాలు తీసుకునేవాళ్లు తప్పకుండా గైడ్లైన్స్ పాటించాలని సూచించింది. 18 ఏండ్లు దాటినవాళ్లకే టీకాలు వేయాలని, గర్భిణులు, బాలింతలకు వేయొద్దని స్పష్టం చేసింది. ఫస్ట్ డోస్ ఏ కంపెనీది వేసుకుంటే సెకండ్ డోస్ కూడా అదే కంపెనీది వేసుకోవాలని సూచించింది.
ప్రారంభించనున్న ప్రధాని మోడీ
కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రధాని నరేం ద్రమోడీ శనివారం ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి వర్చువల్ మీటిం గ్ ద్వారా ఆయన ఉదయం 10.30 గంటలకు ఈ డ్రైవ్ ను స్టార్ట్ చేస్తారు. దేశవ్యాప్తంగా కనీసం 60 హాస్పిటల్స్ సిబ్బందితో, వ్యాక్సిన్ వేసుకునేవాళ్లతో ముచ్చటించనున్నారు. మన రాష్ట్రంలోని గాంధీ హాస్పిటల్ , నార్సింగి రూరల్ హెల్త్ సెంటర్ స్టాఫ్ తో మాట్లాడుతారు.
వ్యాక్సినేషన్ స్టార్ట్ కానున్న తొలిరోజు శనివారం దేశవ్యాప్తంగా 3 లక్షల మందికి టీకా వేస్తారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కొవిషీల్డ్, కొవాగ్జిన్ పంపారు. ప్రయార్టీ లిస్టు ప్రకారం మొదట హెల్త్, ఐసీడీఎస్(ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్) వర్కర్స్కు టీకా వేస్తారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 3,006 కేంద్రాల్లో తొలిరోజు ఒక్కో సెంటర్లో సుమారు 100 మందికి వ్యాక్సిన్ వేస్తారు. తెలంగాణలో ప్రతి సెంటర్లో 30 మందికి చొప్పున వ్యాక్సిన్ వేయనున్నారు. ప్రపంచంలోనే లార్జెస్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంగా పిలుస్తున్న ఈ డ్రైవ్ నిరంతరం కొనసాగుతుంది. మొదటి విడతలో భాగంగా పది రోజుల్లో హెల్త్ వర్కర్స్కు వ్యాక్సినేషన్ పూర్తవుతుంది. తర్వాత మిగతా ఫ్రంట్లైన్ వర్కర్స్కు, ప్రయార్టీ లిస్టుకు వ్యాక్సినేషన్ ఉంటుంది. హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ కోసం వ్యాక్సిన్ ఖర్చును తామే భరిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. ఇలా 3 కోట్ల మందికి కేంద్రమే టీకా వేయించనుంది.
1.65 కోట్ల డోసులు సరఫరా
ఇప్పటికే దేశవ్యాప్తంగా కోటీ 65 లక్షల వ్యాక్సిన్ డోసులను కేంద్రం సరఫరా చేసింది. ఇందులో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కనిపెట్టిన, ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్ ఒకటి. ఈ టీకాను మనదేశంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తోంది. మరో టీకా ‘కొవాగ్జిన్’. దీన్ని మన హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ రూపొందించింది. వ్యాక్సినేషన్ను కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు పరిశీలించనుంది. వ్యాక్సిన్ వేసుకునేవారి పేర్లను ఇప్పటికే ‘కొవిన్’ వెబ్సైట్, యాప్లో నమోదు చేశారు. వ్యాక్సిన్ తీసుకోవాలనుకునేవారు తప్పకుండా ఈ వెబ్సైట్ లేదా యాప్లో పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ స్టాక్, బెనిఫిషియరీస్ వివరాలు కొవిన్ వెబ్సైట్లో ఉంటాయి. మొదటి డోస్ తీసుకున్నాక 28 రోజులకు రెండో డోస్ వేస్తారు. రెండు డోస్లు తప్పనిసరిగా తీసుకోవాలి. రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాక్సినేషన్ ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి బట్టి వారంలో 3 నుంచి 4 రోజలు వ్యాక్సిన్ వేస్తారు.
అంతా రెడీ
శనివారం ప్రారంభం కానున్న వ్యాక్సినేషన్ డ్రైవ్కు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సిద్ధమయ్యాయి. వ్యాక్సిన్ వేసుకునేవారు ఎవరు? వేసే వారు ఎవరు? అనే లిస్టును ఆఫీసర్లు రెడీ చేశారు. వ్యాక్సినేషన్ స్టార్టవుతున్నందున అన్ని కేంద్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. దేశవ్యాప్తంగా ఈ డ్రైవ్ను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభిస్తుండగా.. ఆయా రాష్ట్రాల్లో మంత్రులు, గవర్నర్లో ప్రారంభించనున్నారు. వ్యాక్సిన్ కోసం ఎగబడొద్దని, ప్రయార్టీ ప్రకారం అందరికీ అందేలా చూస్తామని అధికారులు చెప్తున్నారు.
ఇవీ చదవండి
పోషక విలువలున్నాయని ఎక్కువగా తింటే..
జూనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్: సామియా @ వరల్డ్ నెంబర్-2
నెట్ బౌలర్గా వెళ్లి 3 ఫార్మాట్లలో అరంగేట్రం