- రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా హాస్పిటల్లో రోగులకు ఇక్కట్లు
- మెషిన్ ఏర్పాటుపై ప్రకటనకే పరిమితమైన యాజమాన్యం
- కొవిడ్, బ్లాక్ ఫంగస్ వ్యాధుల గుర్తింపులో ఇదే కీలకం
- ప్రైవేటు ల్యాబ్ను ఆశ్రయిస్తున్న సింగరేణీయులు
రామకృష్ణాపూర్/మందమర్రి, వెలుగు: కార్మిక సంక్షేమానికి రూ.కోట్లలో ఖర్చు పెడ్తున్నామని, వారి ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని సింగరేణి యాజమాన్యం చెబుతోంది. అయితే రోగుల సమస్యను తెలుసుకోవడానికి అవసరమైన సీటీ స్కాన్ మెషిన్లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కరోరా విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్రోగికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, బ్లాక్ఫంగస్ లక్షణాలు తెలుసుకోవడంలో సీటీ స్కాన్కీలకం. దీంతోపాటు ఇతర ట్రీట్మెంట్కు కూడా ఎంతో అవసరం. ఈఎన్ టీ డాక్టరు వద్దకు వచ్చే రోగుల్లో సగం మందికి పైగా సైనస్ సంబంధిత సమస్యలవారే. వీరిలో ఇన్ఫెక్షన్అంచనా వేయడానికి, రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలైతే మెదడు పరిస్థితి, శరీరంలో కణతులు గుర్తించేందుకు సీటీ స్కాన్ తప్పనిసరి. ఎంతో అవసరమైన ఈ మెషిన్ను మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలనే డిమాండ్ఏండ్లుగా ఉంది. మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్జిల్లాలోని బొగ్గు గనుల్లో పనిచేసే సింగరేణి ఎంప్లాయీస్, వారి కుటుంబాలకు ట్రీట్మెంట్పరంగా రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి కీలకం. రోజూ ఆసుపత్రికి సుమారు 1,500 మంది వస్తుంటారు. మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల్లోని సుమారు లక్షన్నర మంది సింగరేణీయులు, వారి కుటుంబాలు, కాంట్రాక్ట్ కార్మికులు, రిటైర్డు ఉద్యోగులకు ఇదే ఆధారం. ఇక్కడ మెషిన్లేకపోవడంతో రోగులను గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రికి పంపిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులు మంచిర్యాల, కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.
సీఎండీ హామీ ఏమైంది
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిని కొవిడ్ సెంటర్గా మార్చింది. కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్, క్వారంటైన్, ఐసోలేషన్సెంటర్ సౌలత్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మరోవైపు కొవిడ్రోగికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, బ్లాక్ ఫంగస్లక్షణాలు తెలుసుకునేందుకు అవసరమైన సీటీ స్కాన్మెషిన్ను సైతం రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రికి మంజూరు చేస్తున్నట్లు మే మొదటివారంలో సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ప్రకటించారు. తరచూ ఆసుపత్రిని సందర్శించే సింగరేణి డైరెక్టర్లు, గుర్తింపు సంఘం లీడర్లు సీటీ స్కాన్ మెషిన్ త్వరలో ఏర్పాటు చేస్తారంటూ చెప్పుకొంటున్నారు. అయితే ఇప్పటివరకు సింగరేణి యాజమాన్యం ఆసుపత్రిలో సీటీ స్కాన్కోసం ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కొవిడ్ నేపథ్యంలో ఏడాదిగా స్కానింగ్అవసరాలు బాగా పెరిగాయి. ఇప్పటికైనా హాస్పిటల్లో మెషిన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సింగరేణీయులు కోరుతున్నారు.