- ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకి కరోనా పాజిటివ్
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కరోనా బారిన పడ్డారు. సోమవారం నిర్వహించిన కొవిడ్ పరీక్షలో ఆయనకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం తాను ఖమ్మంలోని తన నివాసంలో హోమ్ క్యారంటైన్లో ఉన్నట్లు ఎమ్మెల్యే సండ్ర పేర్కొన్నారు. గత రెండు రోజులు మంత్రులతో పలు ప్రోగ్రామ్లలో పాల్గొన్నాని, కరోనా జాగ్రత్తలు పాటించినప్పటికీ కొవిడ్ పాజిటివ్గా తేలిందని ఆయన తెలిపారు. గత కొద్ది రోజులుగా తనని కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఎమ్మెల్యే కోరారు.
ఇవి కూడా చదవండి..
ఆకలైతాంది బామ్మ..!
పంతం నెగ్గించుకున్న కర్ణాటక రైతు.. ఇంటికే వెళ్లి వాహనం డెలివరీ