ఎమ్మెల్సీ వాణిదేవికి కరోనా

ఎమ్మెల్సీ వాణిదేవికి కరోనా

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవికి కరోనా సోకింది. ఇవాళ చేయించుకున్న కరోనా పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె అయిన ఆమె ఇటీవల టీఆర్ఎస్ లో చేరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలుపొందిన విషయం తెలిసిందే. సెకండ్ వేవ్ కరోనా అలర్ట్ నేపధ్యంలో ఆమె కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇవాళ వచ్చిన ఫలితాల్లో ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. గత కొన్ని రోజులుగా తనను కలసిన వారు, తనతో సన్నిహితంగా తిరిగిన వారందరూ దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. వయసు ఎక్కువ ఉన్న వారు... ముఖ్యంగా కార్యకర్తలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకుని నెగటివ్ వచ్చినా  హోం ఐసోలేషన్లో ఉండాలని  ఆమె కోరారు. తనను కలసిన వారందరూ అవసరమైతే కోవిడ్ పరీక్షలు చేయించుకుని కొన్ని రోజులపాటు బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని ఆమె కోరారు.