RBI గవర్నర్ శక్తికాంత దాస్ కు కరోనా పాజిటివ్

RBI గవర్నర్ శక్తికాంత దాస్ కు కరోనా పాజిటివ్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ కరోనా బారిన పడ్డారు. స్వయంగా ట్వీట్ చేసి ఈ విషయాన్ని తెలిపారు. కరోనా వైరస్ తీవ్రత ఇంకా తగ్గడం లేదని… ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా వైరస్ సంక్రమణ ఇటీవలి కాలంలో మళ్లీ పెరుగుతోందన్నారు. ఇప్పుడు RBI గవర్నర్ శక్తికాంత దాస్ కు కరోనా వైరస్ సోకింది. స్వయంగా ట్వీట్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. అయితే తనకు ఎలాంటి వ్యాధి లక్షణాలూ లేవని, ప్రస్తుతానికి ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లినట్లు చెప్పారు. అంతేకాదు తనతో పరిచయం ఉన్న వారు కూడా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

మరోవైపు తాను క్వారంటైన్ లో ఉన్నా రిజర్వ్ బ్యాంక్  పని సజావుగా కొనసాగుతుందని…డిప్యుటీ గవర్నర్లు,ఇతర అధికారులతో ఫోన్, వీడియో కాల్స్ ద్వారా టచ్ లో ఉంటూ పని చేస్తానని ట్వీట్ చేశారు శక్తికాంత దాస్.