హైదరాబాద్, వెలుగు: రాజ్భవన్లో పనిచేసే పది మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారి కుటుంబ సభ్యులు మరో పది మందికీ వైరస్ సోకింది. ఆ 20 మందిని ఎర్రగడ్డలోని ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డులో చేర్పించి ట్రీట్మెంట్ చేస్తున్నారు. శని, ఆదివారాల్లో రాజ్భవన్లో పనిచేసే మొత్తం 395 మంది పోలీసులకు టెస్ట్ చేయగా 28 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని రాజ్భవన్ అధికారులు వెల్లడించారు. దీంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా టెస్టులు చేయించుకున్నారని, ఆమెకు నెగెటివ్ వచ్చిందని తెలిపారు.
టెస్టులు చేయించుకోండి
కరోనా పేషెంట్లను కలిసిన వ్యక్తులు, రెడ్జోన్లలో ఉండే ప్రజలు వీలైనంత తొందరగా కరోనా టెస్ట్ చేయించుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. టెస్ట్ చేయించుకునేలా ఇతరులనూ ప్రోత్సహించాలన్నారు. వెంటనే టెస్ట్ చేయించుకుంటే తమను తాము కాపాడుకోవడంతో పాటు ఇతరులకు వైరస్ సోకకుండా జాగ్రత్త పడొచ్చని అన్నారు. ఎలాంటి మొహమాటం లేకుండా టెస్ట్ చేయించుకోవాలన్నారు. తాను కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నానని, నెగెటివ్ వచ్చిందని ఆమె చెప్పారు. ‘టెస్ట్.. ట్రేస్.. ట్రీట్.. టీచ్’ అంటూ ఆదివారం ఆమె ట్వీట్ చేశారు. ఇరుగుపొరుగతో ఇబ్బందులొస్తాయన్న భయంతో లక్షణాలున్న చాలా మంది టెస్టులు చేయించుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. దీంతో ఆమె చేసిన ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇతర పద్ధతుల్లో ఆదాయంపై ఫోకస్
బస్సులు సరిగా నడవకపోవడంతో ప్రస్తుతం టికెటేతర ఆదాయం పెంచుకోవడంపైనే ఆర్టీసీ ఫోకస్ పెట్టింది. ఇటీవల కార్గో, పార్సిల్ సర్వీసులను ప్రారంభించింది. వీటి ద్వారా ఏటా రూ. 200 కోట్లు టార్గెట్ గా పెట్టుకుంది. ఇక బస్ పాస్ కౌంటర్లను కూడా సొంతంగా నిర్వహించనుంది. ఇప్పటిదాకా దీన్ని ఔట్ సోర్సింగ్కు ఇచ్చారు. పెట్రోల్ బంకులు కూడా ఔట్ సోర్సింగ్ వారే నడిపిస్తున్నారు. దీన్ని కూడా ఆర్టీసీనే నడపనుంది. అంతేకాకుండా ఆర్టీసీలో డ్రైవింగ్ స్కూళ్లు కూడా పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.