న్యూఢిల్లీ: మైలాబ్కు చెందిన కొవిసెల్ఫ్ కరోనా కిట్కు అనుమతిచ్చిన నేపథ్యంలో ఇంట్లోనే ఉండి కరోనా టెస్టు ఎలా చేసుకోవాలో ఐసీఎంఆర్ గైడ్లైన్స్ విడుదల చేసింది. కరోనా సోకిన వ్యక్తులను కలిసినోళ్లు లేదా లక్షణాలున్న వాళ్లే టెస్టు చేసుకోవాలని చెప్పింది. ర్యాపిడ్ టెస్ట్లో పాజిటివ్ వస్తే 100% పాజిటివ్గానే భావించాలని, మరోసారి టెస్టు చేయించుకోవాల్సిన అవసరంలేదని చెప్పింది. అలాంటి వాళ్లంతా ఐసోలేషన్లో ఉండాలంది. లక్షణాలున్నా నెగెటివ్ వస్తే ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాలని చెప్పింది. మరో వారంలో కిట్ మార్కెట్లోకి రానుందని, ధర రూ. 250గా నిర్ణయించామని మైలాబ్ స్పష్టం చెసింది.
టెస్టు ఎట్ల చేస్కోవాలంటే..
ప్రతి కిట్లో నాసల్ స్వాబ్, టెస్టింగ్ కార్డు, బయో హజార్డ్ బ్యాగ్, ముందే నింపిన ఎక్స్ట్రాక్షన్ ట్యూబ్ వస్తాయి. మైలాబ్ కొవిసెల్ఫ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్లో వివరాలు నమోదు చేశాక కిట్లోంచి టెస్టింగ్ కార్డ్పై ఉన్న క్యూ ఆర్ కోడ్ను మొబైల్తో స్కాన్ చేయాలి. ముందే నింపిన ఎక్స్ట్రాక్షన్ ట్యూబ్ను తీసి దాన్ని నిలువుగా పట్టుకోవాలి. అందులోని ద్రవం అంతా అడుగున చేరేవరకు వెయిట్ చేయాలి. ట్యూబ్ నుంచి నాసల్ స్వాబ్ను తీసుకోవాలి. ముక్కులోని ఓ రంధ్రంలో చివరి వరకూ పెట్టుకొని చుట్టూ తిప్పాలి. అదే నాసల్ స్వాబ్తో ఇంకో రంధ్రంలో ఇలాగే చేయాలి. ఎక్స్ట్రాక్షన్ ట్యూబ్మూత తీసి నాసల్ స్వాబ్(తల మొత్తం మునిగేలా) అందులో పెట్టాలి. ట్యూబ్లో పెట్టేటప్పుడు స్వాబ్ తలను ముట్టుకోకూడదు.
ట్యూబ్ను పట్టుకొని స్వాబ్ను ద్రవంలో 10సార్లు తిప్పాలి. స్వాబ్ హెడ్ను చూసి విరిచేయాలి. ట్యూబ్ను మూతతో సీల్ చేయాలి. ట్యూబ్ను టెస్టింగ్కార్డుపై సెట్ చేసి రెండు డ్రాప్స్ మిక్షర్ను టెస్టింగ్ పరికరంపై వేయాలి. 15 నుంచి 20 నిమిషాలు వెయిట్ చేయాలి. తర్వాత టెస్టింగ్ కార్డ్ను ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. రిజల్ట్ పాజిటివ్ వస్తే క్వాలిటీ కంట్రోల్ లైన్, టెస్ట్ లైన్ రెండూ కార్డుపై కనిపిస్తాయి. నెగెటివ్ వస్తే క్వాలిటీ కంట్రోల్ లైన్ మాత్రమే కనబడుతుంది. అది కనబడకపోయినా, టెస్టు లైన్ కనబడినా పరీక్ష సరిగా చేయనట్లే. పరీక్ష పూర్తయ్యాక వాడిన వాటిన్నింటినీ బయో హజార్డ్ బ్యాగ్లో పెట్టాలి. సేఫ్గా డిస్పోజ్ చేయాలి.