- కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్
న్యూఢిల్లీ: 50 ఏండ్లు పైబడిన వాళ్ల కు వచ్చే నెల నుంచి కరోనా వ్యాక్సి నేషన్ చేస్తామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇప్పటి వర కు ఫ్రంట్లైన్ వర్కర్లకు ప్రయారిటీ ఇచ్చి వ్యాక్సినేషన్ చేపట్టామని, 80 నుంచి 85% మంది టీకా వేసుకు న్నారని వివరించారు. ప్రయారిటీ లిస్ట్లో తర్వాత 50 ఏండ్లు దాటిన వాళ్లకు కరోనా టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. కరోనా కేసులపై సోమ వారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో కరోనా కేసులు తగ్గుతు న్నాయని, గడిచిన వారం రోజుల్లో దేశంలోని 188 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని మంత్రి తెలిపారు. అందరికీ ఆరోగ్యం అన్న మన కాన్సెప్ట్ ప్రపంచ వ్యాప్తమవు తోందని హర్షవర్దన్ చెప్పారు.
For More News..
ఈ కారు నిజంగా సూపర్.. చెట్లు, కొండలెక్కుతుంది.. ఎగురుతుంది
కేసీఆర్పై బాహుబలి రేంజ్లో డాక్యుమెంటరీ
ఎన్జీటీ వద్దన్నా.. ఏపీ సంగమేశ్వరం పనులు చేస్తోంది