
సౌతాఫ్రికా నుంచి వచ్చి గుట్టుచప్పుడు కాకుండా షాద్ నగర్ లో తిరుగుతున్న ఓ వ్యక్తిని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు గుర్తించారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన తన్నీరు శ్రీనివాస్ దక్షిణాఫ్రికా నుండి ఈనెల 21వ తేదీన ముంబై వచ్చాడు. ముంబై నుంచి షాద్ నగర్ కు వచ్చిన శ్రీనివాస్.. తాను విదేశాల నుంచి వచ్చినట్లు చెప్పకుండా గత పది రోజులుగా తన బంధువుల వద్ద ఉంటున్నాడు. ఈ సందర్భంగా హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్ వారి నుండి పూర్తి సమాచారం సేకరించారు. శ్రీనివాస్ తో పాటు వైద్య సిబ్బంది ఉదయ్ కుమార్ తదితరులు ఇంటికి స్టిక్కర్ అంటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్నా డాక్టర్ విజయ్ కుమార్ తన్నీరు శ్రీనివాస్ వ్యవహారం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చెప్పా పెట్టకుండా విదేశాల నుండి వచ్చి సైలెంట్ గా కాలనీలో తిరగడం ఏంటని నిలదీశారు. ఇది మంచి పద్ధతి కాదని విపత్కర పరిస్థితుల్లో గుట్టుచప్పుడు కాకుండా ప్రజల్లో మెలగడం మంచిది కాదని చెప్పారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని విజయ్ కుమార్ అధికారులను కోరారు. శ్రీనివాస్ పాస్ పోర్టును అధికారులు సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమాచారాన్ని వైద్య సిబ్బంది షాద్ నగర్ తాహసీల్దార్ పాండు నాయక్ కు అందించారు.