జగిత్యాల జిల్లాలో కరోనా కొత్త స్టెయిన్.. ఏడుగురికి పాజిటివ్

జగిత్యాల జిల్లాలో కరోనా కొత్త స్టెయిన్.. ఏడుగురికి పాజిటివ్

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని అనుకుంటున్న సమయంలో కరోనా వైరస్ కొత్త స్టెయిన్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా జగిత్యాల జిల్లాలో ఈ వైరస్ మూలాలు బయటపడ్డాయి. మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన ఒకే ఇంట్లో ఏడుగురికి ఈ వైరస్ సోకింది. వారిలో ఓ వ్యక్తి గత నెల 25న యూకే నుంచి ఇండియాకు వచ్చాడు. ఆయన నుంచి కుటుంబసభ్యులందరికీ ఈ వైరస్ సోకింది. ఇంట్లో వాళ్లందరూ అస్వస్థతకు గురికావడంతో కరోనా పరీక్షలు నిర్వహించగా.. కరోనా కొత్త స్టెయిన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. దాంతో వెంటనే వారందరినీ హైదరాబాద్‌కు తరలించారు. కాగా.. వీరితో పాటు నెగటివ్ వచ్చిన మరో నలుగురు కుటుంబసభ్యులను కూడా పరీక్షించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. కోరుట్ల మండలం వెంకటాపూర్‌లోనూ ఓ వ్యక్తికి ఇదే రకమైన కొత్త స్టెయిన్ సోకినట్లు గుర్తించడంతో హైదరాబాద్‌కు తరలించారు. జిల్లాలో ఒకేసారి రెండు ప్రాంతాలలో కరోనా కొత్త స్టెయిన్ బయటపడటంతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు.