శంషాబాద్, వెలుగు: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పీరం చెరువు గ్రామంలోని గిరిధారి అపార్ట్మెంట్లో శనివారం10 మందికి కరోనా పాజిటి
వ్గా నిర్ధారణ కావడంతో కార్పొరేషన్ అధికారులు అలర్ట్ అయ్యారు. గిరిధారి అపార్ట్ మెంట్ వాసులకు ఆదివారం వైద్యాధికారులు కరోనా టెస్టులు నిర్వహించారు. అనంతరం అపార్ట్మెంట్ మొత్తాన్ని మున్సిపల్ సిబ్బంది శానిజైజ్ చేశారు. కార్యక్రమంలో బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ మేనేజర్ మనోహర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.