జవహర్ నగర్ మేయర్పై సొంత పార్టీ నేతల అవిశ్వాసం

జవహర్ నగర్ మేయర్పై సొంత పార్టీ  నేతల అవిశ్వాసం

జవహర్ నగర్‌లో కార్పొరేషన్ రాజకీయం హాట్ టాఫిక్ గా మారింది. సొంత పార్టీకి చెందిన కార్పొరేటర్లు మేయర్ మేకల కావ్యపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. దాదాపు 20 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానంపై సంతకం చేసి మేడ్చల్ కలెక్టరేట్ లో అందజేశారు. మేయర్ మేకల కావ్య ఒంటెత్తు పోకడలు, ఆమె కుటుంబ సభ్యుల తీరును నిరసిస్తూ కార్పొరేటర్లు గతంలోనూ తిరుగుబాటు చేశారు. తాజాగా అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. 

మూడేళ్ల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లాలో నాలుగు కార్పొరేషన్లు, 9 మున్సిపల్ ఛైర్మన్ పదవులు సొంతం చేసుకుంది. ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్ కార్పొరేటర్లు కొందరు గులాబీ గూటికి చేరారు. అయితే మూడేళ్ల తర్వాత సొంత పార్టీ నేతలే జవహర్ నగర్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం చర్చనీయాంశంగా మారింది.