పారాసెయిలింగ్‌.. తాడు తెగి సముద్రంలో పడిన జంట

పారాసెయిలింగ్‌.. తాడు తెగి సముద్రంలో పడిన జంట

గాల్లో పక్షిలా ఎగరాలని చాలా మందికి అనిపిస్తుంది. అయితే కొందరికి మాత్రమే అలాంటి ధైర్య సాహసాలు చేయగలరు. పారాచ్యూట్ జంప్, స్కై డైవ్​, పారా సెయిలింగ్ వంటి సాహస క్రీడలతో ఎవరైనా గాల్లో ఎగరొచ్చు. అయితే తాజాగా పారా సెయిలింగ్ చేసిన ఓ జంటకు భారీ షాక్ తగిలింది. తాము పారాసెయిలింగ్ చేస్తున్న సమయంలో తాడు ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో ఆ జంట సముద్రంలో పడిపోయింది. ఈ ఘటన దిహు బీచ్‌లో చోటు చేసుకుంది.

గుజరాత్‌కు చెందిన అజిత్ కథడ్ తన భార్యతో కలిసి దిహులో హాలిడీ ఎంజాయ్ చేయడం కోసం వెళ్లాడు. అక్కడ ఓ పవర్ బోట్ ఎక్కి సముద్రంలోకి వెళ్లారు. అక్కడ పారా సెయిలింగ్ చేశారు. అయితే జంట కాస్త ఎత్తు వెళ్లాక తాడు ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో వాళ్లిద్దరు కూడా ఎత్తు నుంచి సముద్రంలో పడిపోయారు. 

ఇదంతా బోట్‌లో ఉన్న అజిత్ సోదరుడు రికార్డ్ చేస్తున్నాడు. దీంతో అతడు వెంటనే తాడు తెగిపోవడాన్ని గమనించి బోటు సిబ్బందికి సమాచారం అందించారు. వారు సముద్రంలోకి దూకి ఆ జంటను కాపాడారు. అజిత్ కథడ్ అతని భార్య పారా సెయిలింగ్ చేస్తున్న సమయంలో లైఫ్ జాకెట్లు ధరించడం వల్ల వారు ప్రాణాలతో బతికి బట్ట కట్టారు. ఈ ఘటనలో వారిద్దరికీ ఎలాంటి గాయాలు కాలేదు.