రేవంత్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

రేవంత్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

మంత్రి కేటీఆర్ ఫాంహౌజ్ ను అనుమతి లేకుండా డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన కేసులో మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి రాజేంద్రనగర్‌ కోర్టు షాక్‌ ఇచ్చింది. డ్రోన్‌ కెమెరాల కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న రేవంత్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ పై విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఆయనతో పాటు అరెస్ట్‌ అయిన ఐదుగురుకి మాత్రం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

కేటీఆర్ ఫాంహౌజ్ ను డ్రోన్ కెమెరాలతో షూట్ చేశారన్న ఆరోపణల కేసులో.. రేవంత్ రెడ్డి నిన్న(గురువారం) అరెస్టయ్యారు. రేవంత్ రెడ్డికి… జడ్జీ  14 రోజుల రిమాండ్‌ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసులో రేవంత్‌ను మొదటి నిందితుడిగా తెలిపారు.