గోమాతకు స్వయంవరం.. వెడ్డింగ్ కార్డ్ వైరల్

గోమాతకు  స్వయంవరం..  వెడ్డింగ్ కార్డ్ వైరల్

స్వయంవరం ఈ మాట అప్పుడెప్పుడో రాజుల కాలంలో నిర్వహించేవారని చరిత్రలో చదువుకున్నాం.  స్వయంవరం అంటే పెళ్లి యువరాజు.. యువరాణి పెళ్లి చేసుకోవడం...  సరే ఈరోజుల్లో పెళ్లి చూపులతో పెళ్లి తంతు ప్రారంభమవుతుంది.  అయితే ఈ మధ్యకాలంలో జనాలు సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు రకరకాల పనులు చేస్తున్నారు.  పెంపుడు జంతువులకు పుట్టిన రోజులు.. పెళ్లిళ్లు ఇలా చేస్తూ ఆన్ లైన్ లో నానా హంగామా సృష్టిస్తున్నారు.  ఇప్పుడు తాజాగా ఓ ఆవుకు స్వయంవరం అంటూ యజమానులు వెడ్డింగ్ కార్డ్ రిలీజ్ చేశారు.  ఈ శుభలేఖను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ అయింది.శుభలేఖ వేసి దాంట్లో ఆవు ఫోటో వేసి మరీ ప్రకటించాడు. ఇంతకీ ఏమా ‘గోమాత స్వయం వరం’ కథేంటో  తెలుసుకుందాం.   .

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ రమణయ్య పేట గ్రామంలో గౌరీ శేఖర్ అనే వ్యక్తి ఓ ఆవును పెంచుకుంటున్నారు.  ఆ ఆవుకు వారు సారణ అని పేరు పెట్టారు.  గౌరీ శేఖర్ తిరుమల ఆస్పత్రిలో డాక్టర్ గా పని చేస్తున్నారు.  ఆయన భార్య రమాదేవి కూడా కూడా డాక్టరే.  వారు ఆ ఆవును కన్నబిడ్డ మాదిరిగా చూసుకుంటున్నారు.  ఆవుకు(సారణ) బారసాల వేడుకను కూడా చేసి అచ్చంగా చంటిబిడ్డలకు చేసినట్లుగా ఊయల వేడుకను కూడా నిర్వహించిన స్థానికులను ఆశ్చర్యపరిచారు. అప్పట్లో ఆవుదూడకు బారసార వేడుక చేయటం వైరల్ గా మారింది.

తాజాగా అదే సారణ యుక్త వయస్సు వచ్చిందని స్వయంవరాన్ని ప్రకటించి మరోసారి డాక్టర్ గౌరీ శేఖర్ వైరల్ అవుతున్నారు. 21వ మాసంలోకి అడుగిడిన సారణకు వివాహ వయసు రావడంతో వైద్యులైన గౌరీశేఖర్, రమాదేవీ దంపతులు స్వయంవరం ప్రకటించి ... వివిధ   ప్రాంతాలలోని నందీశ్వరులకు శుభలేఖను ఆహ్వానం పంపారు.అంతేకాదు..ఈ మహోత్సవానికి ఓ ఫంక్షన్ హాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ హాలు వద్ద సారణను వరించేందుకు విచ్చేసిన నందీశ్వరుల వరుసలో ఉంచారు. దీంతో వరమాలతో సారణ తనకు నచ్చిన నందీశ్వరుడిని ఎంపిక చేసుకోనుందట. ఆ తరువాత ఇక వివాహం విందు కూడా ఉందంటు ప్రకటించారు డాక్టర్ దంపతులు. ఫంక్షన్‌ హాలులో వివాహ మహోత్సవానికి ప్రత్యేక మెనుని కూడా సిద్ధం చేయనున్నట్లుగా శుభలేఖలో పేర్కొన్నారు. సారణ కల్యాణ మహోత్సవానికి కంచి, తిరుపతి,తిరువణ్ణామలై నుంచి వచ్చేయుచున్న వేద పండితులచే శాస్త్రోక్తంగా, వైభవంగా వివాహం జరిపించబడును అంటూ శుభలేఖలో రాయించారు.

ఈ శుభలేఖకు గోఆధారిత వ్యవసాయంతో పండిన పంటలతో విందు భోజనం కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఇట్లు ఆగమనాభిలాషలు డాక్టర్ రమాదేవి, డాక్టర్ గౌరీ శేఖర్ అని రాయించారు. వేదిక తిరుమల హాస్పిటల్ కాకినాడ అని శుభలేఖలో సారణ బుల్లిదూడతో కలిసి ఉన్న డాక్టర్ గౌరీ శేఖర్ ఫోటోలను శుభలేఖలో ముద్రించారు.

ALSO READ :- కర్వా చౌత్ : ఫస్ట్ టైం ఉపవాసం చేస్తున్నట్టయితే.. ఈ నియమాలు పాటించండి