- నాగర్కర్నూల్జిల్లా నర్సంపల్లిలో ఘటన
వంగూర్, వెలుగు : నాగర్కర్నూల్జిల్లాలో రెండు పాడి ఆవుల కొమ్ములకు గుర్తు తెలియని దుండగులు కరెంట్వైర్లు పెట్టి షాక్ ఇచ్చి చంపేశారు. బాధితుల కథనం ప్రకారం..నాగర్కర్నూల్జిల్లా వంగూర్మండలం నర్సంపల్లి గ్రామానికి చెందిన శ్రీశైలం, అలివేలు రోజు మాదిరిగానే పొలం వద్ద ఆవులను మేపి సాయంత్రం పాలు పితికి ఇంటికి వచ్చారు. ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా రెండు ఆవులు చనిపోయి కనిపించాయి. ఆవుల కొమ్ములకు వైర్లు చుట్టి కరెంట్కనెక్షన్ఇచ్చి ఉండడాన్ని చూసి ఇది ప్రత్యర్థుల పనేనని తెలుసుకున్నారు.
ALSO READ: జీఎంఆర్కు రూ.2 వేల 469 కోట్ల విలువైన ఆర్డర్
ఏ పాపం ఎరుగని మూగజీవాలను చంపడానికి చేతులు ఎలా వచ్చాయంటూ ఆవులపై పడి రోదించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆవుల విలువ రూ. 2 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ కురుమూర్తి తెలిపారు.