న్యూఢిల్లీ : జీఎంఆర్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరప్రదేశ్లో రూ. 2,469.71 కోట్ల విలువైన స్మార్ట్ మీటర్ ఇన్స్టాలేషన్ ప్రాజెక్ట్ను దక్కించుకుంది. జీఎంఆర్ గ్రూప్ కంపెనీ జీఎంఆర్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ (జీఎస్ఈడీపీఎల్) ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా, అలీగఢ్ జోన్లలో స్మార్ట్ మీటర్లను అమర్చడానికి లెటర్ ఆఫ్ అవార్డు (ఎల్ఓఏ) అందుకున్నట్లు జీఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్ (పీజీయూఐఎల్) తెలిపింది. మొత్తం కాంట్రాక్ట్ విలువ (జీఎస్టీతో కలిపి) దాదాపు రూ. 2,469.71 కోట్లుగా పేర్కొంది. పైన పేర్కొన్న ప్రాంతాల్లో 25.52 లక్షల స్మార్ట్ మీటర్లను ఇన్స్టాల్ చేస్తుంది.
ALSO READ: ఆస్తులు పంచాకే .. అన్న అంత్యక్రియలు చేస్తామని తమ్ముళ్లు ధర్నా