జీఎంఆర్​కు రూ.2 వేల 469 కోట్ల విలువైన ఆర్డర్

జీఎంఆర్​కు రూ.2 వేల 469 కోట్ల విలువైన ఆర్డర్

న్యూఢిల్లీ :  జీఎంఆర్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరప్రదేశ్‌‌‌‌లో రూ. 2,469.71 కోట్ల విలువైన స్మార్ట్ మీటర్ ఇన్‌‌‌‌స్టాలేషన్ ప్రాజెక్ట్‌‌‌‌ను దక్కించుకుంది.  జీఎంఆర్​ గ్రూప్ కంపెనీ  జీఎంఆర్​ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ (జీఎస్​ఈడీపీఎల్​) ఉత్తరప్రదేశ్​లోని ఆగ్రా,  అలీగఢ్​ జోన్‌‌‌‌లలో స్మార్ట్ మీటర్లను అమర్చడానికి లెటర్ ఆఫ్ అవార్డు (ఎల్​ఓఏ) అందుకున్నట్లు జీఎంఆర్​ పవర్ అండ్ అర్బన్ ఇన్‌‌‌‌ఫ్రా లిమిటెడ్ (పీజీయూఐఎల్​) తెలిపింది.  మొత్తం కాంట్రాక్ట్ విలువ (జీఎస్‌‌‌‌టీతో కలిపి) దాదాపు రూ. 2,469.71 కోట్లుగా పేర్కొంది.   పైన పేర్కొన్న ప్రాంతాల్లో 25.52 లక్షల స్మార్ట్ మీటర్లను ఇన్‌‌‌‌స్టాల్ చేస్తుంది. 

ALSO READ: ఆస్తులు పంచాకే .. అన్న అంత్యక్రియలు చేస్తామని తమ్ముళ్లు ధర్నా