దృష్టి మళ్లించి దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్ట్

దృష్టి మళ్లించి దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్ లో దృష్టి మళ్లించి దొంగతనాలు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. పగలు రెక్కీ చేసి రాత్రి టైంలో ఇళ్లలో దొంగతనం చేస్తున్నారని చెప్పారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో ఈ ముఠా చోరీలకు పాల్పడిందన్నారు. ఆదిలాబాద్- కామారెడ్డి- హైదరాబాద్ లో కేసులు వీళ్లపై కేసులున్నాయని తెలిపారు. మొత్తం 41 కేసుల్లో నిందితుడు ఉన్నాడని.. ముగ్గురు అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులు ఉన్నారని చెప్పారు సీపీ.