
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ముగ్గురు సీఐలపై బదిలీ వేటు పడింది. సైదాబాద్ సీఐ రవి, సీఐ నాగేశ్వర్ రెడ్డి, మీర్ చౌక్ సీఐ ఆనంద్ పై బదిలీ వేటు వేస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
విధుల్లో నిర్లక్ష్యం, శాంతి భద్రతలు కాపాడలేకపోవడం వల్లే బదిలీ చేశామని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. అసమర్థత, కేసులను ఛేదించకపోవడం దీనికి కారణమన్నారు. రోజువారి స్టేషన్ డ్యూటీ మెంటైన్ చేయకపోవడం ఈ ముగ్గురిపై బదిలీ వేటు వేశామని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.