హైదరాబాద్, వెలుగు: సింగరేణి కాలరీస్ లో జరిగిన అక్రమాలు, అవినీతిని న్యాయవిచారణ పరిధిలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో మంగళవారం ఈ బృందం సీఎంను మర్యాదపూర్వకంగా కలిసింది.
‘‘గతంలో సమ్మె నోటీసు ఇచ్చిన జెన్ కో కార్మికులు, ఇతర ఉద్యోగులపై అప్పటి బీఆర్ఎస్ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడింది. పలువురు కార్మికులు, ఉద్యోగులను తొలగించింది. అధికారులను డిమోట్ చేసింది. వాటిని సరి చేయడంతోపాటు, సింగరేణి, జెన్ ట్రాన్స్ కో సంస్థలకు సమర్థులైన అధికారులను నియమించాలి’ అని సీఎంను కోరినట్లు వారు చెప్పారు.