కేసీఆర్​ ఒక్కరే బీజేపీపై పోరాడుతారా?.. ఏకపక్ష నిర్ణయాలు సరికాదన్న నారాయణ

కేసీఆర్​ ఒక్కరే బీజేపీపై పోరాడుతారా?.. ఏకపక్ష నిర్ణయాలు సరికాదన్న నారాయణ

సీఎం కేసీఆర్​ తీరుపై మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు, కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలను పిలవకుండా ఏకపక్షంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పు పట్టారు. సీఎం కేసీఆర్​ ఒక్కరే బీజేపీపై పోరాడాలని అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. బీఆర్​ఎస్​ పార్టీ ..ప్రతిపక్షాలను కలుపుకొనిపోవాలని సూచించారు. 

సమైక్య వాదాన్ని,సెక్యూలరిజాన్ని దెబ్బకొట్టి, విద్యా వ్యవస్థను, రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రధానమంత్రి మోడీ ప్రయత్నిస్తున్నారని నారాయణ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో పర్యటించిన సీపీఐ నేత నారాయణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.