కానిస్టేబుళ్లకు సీపీఆర్ ట్రైనింగ్‌.. హాజరైన మంత్రులు

కానిస్టేబుళ్లకు సీపీఆర్ ట్రైనింగ్‌.. హాజరైన మంత్రులు

హైదరాబాద్ కొంపల్లిలోని ఈఎంఆర్ఐ, జీహెచ్ఎస్ లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లకు కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మల్లా రెడ్డి పాల్గొన్నారు. కాగా ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి కానిస్టేబుళ్లకు సీపీఆర్ ఎలా చేయాలో మార్గ నిర్దేశం చేశారు. ఆ సమయంలో సీపీఆర్ చేసే వారికి ఎక్కువ బలం అవుసరమవుతుందన్నారు. అలా మంత్రులు కూడా వచ్చి సీపీఆర్ ఎలా చేయాలో తెలుసుకున్నారు. వారు కూడా సీపీఆర్ చేయడాన్ని ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి కూడా సీపీఆర్ చేయడం ట్రయల్ చేశారు. అది చూసిన మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ నవ్వుతూ ఆ సన్నివేశాన్ని వీక్షించారు.