
కూకట్పల్లి, వెలుగు: నిర్మాణంలో ఉన్న ఓ భారీ భవనం పైనుంచి పడి క్రేన్ ఆపరేటర్ మృతిచెందాడు. మధ్యప్రదేశ్కు చెందిన యువరాజ్పటేల్(22) కొంతకాలంగా కూకట్పల్లిలోని హానర్ హోమ్స్ కన్స్ట్రక్షన్ కంపెనీలో క్రేన్(టవర్భూమ్) ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఈ మెషీన్ ద్వారా పైఅంతస్తులకు కాంక్రిట్ మిక్సర్ సరఫరా చేస్తుంటారు. గురువారం రాత్రి క్రేన్తో 24వ అంతస్తు వద్ద పని చేస్తుండగా మెషీన్లో ప్రాబ్లమ్ వచ్చి రివర్స్ కొట్టింది. దీంతో మెటీరియల్ అతని మీద పడటంతో పైనుంచి కింద పడి స్పాట్లో మృతి చెందాడు.
క్రేన్ ఢీకొని మహిళ..
మూసాపేటలో నివసించే దాసరి లావణ్య(29) హౌస్కీపర్గా పనిచేస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మూసాపేట నుంచి ప్రశాంత్నగర్ వైపు రోడ్డు దాటుతుండగా క్రేన్ఢీకొట్టింది. స్థానికులు గాంధీ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది.
బోనాల పండుగకు వస్తూ..
జీడిమెట్ల: బోనాల పండగ కోసం కూతురు ఇంటికి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందిన ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన రేణుక(43) బాచుపల్లిలోని తన కూతురు ఇంట్లో బోనాల పండుగ కోసం శుక్రవారం ఇంటి నుంచి బయల్దేరింది. మధ్యాహ్నం విజ్ఞాన్ జ్యోతి కాలేజీ వద్ద రోడ్డు దాటుతుండగా ఓ బైక్ ఆమెను ఢీకొట్టింది. దీంతో కిందపడగా పైనుంచి కారు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది.