న్యూఢిల్లీ : ఇంటిగ్రేటెడ్ ప్యాకేజింగ్ ఎకోసిస్టమ్ ప్లేయర్ క్రియేటివ్ గ్రాఫిక్స్ సొల్యూషన్స్ ఇండియా లిమిటెడ్ తన రూ. 54.4 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)ను ఈ నెల 28న పబ్లిక్ సబ్స్క్రిప్షన్ కోసం ప్రారంభించనున్నట్లు శుక్రవారం తెలిపింది. పబ్లిక్ ఇష్యూ ఏప్రిల్ 4న ముగుస్తుందని, యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ మార్చి 27న ఉంటుంది తెలిపింది. కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ ఎమర్జ్లో లిస్ట్ అవుతాయి.
నోయిడాకు చెందిన ఈ కంపెనీ ఇష్యూలో రూ. 54.4 కోట్ల విలువైన 64 లక్షల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ ఉంటుంది. ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.80-–85గా నిర్ణయించారు. ఐపీఓ ద్వారా వచ్చే ఆదాయం కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి, రుణాన్ని తిరిగి చెల్లించడానికి, వర్కింగ్ క్యాపిటల్ వ్యయానికి మద్దతు ఇవ్వడానికి వాడుతారు.