క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్.. రూ.1.20 లక్షలు సీజ్

క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్.. రూ.1.20 లక్షలు సీజ్

ముషీరాబాద్, వెలుగు: హిమాయత్ నగర్​లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు నిందితులను టాస్క్ ఫోర్స్ సెంట్రల్ జోన్, దోమలగూడ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. హిమాయత్ నగర్​కు చెందిన శ్రీరాజ్ బాబు ఆటో మొబైల్ షాపు నిర్వహిస్తుండగా, ఈజీ మనీ కోసం బెట్టింగ్​దందా మొదలుపెట్టారు. 

ఇందుకోసం చిక్కడపల్లిలో ట్రావెల్ బిజినెస్ చేస్తున్న సాయినాథ్, ప్రైవేటు జాబ్ చేస్తున్న రేగళ్ల గోపీనాథ్​ను 5 శాతం కమీషన్​తో ఏజెంట్లుగా నియమించుకున్నాడు. ఆ తర్వాత విదేశాల నుంచి బెట్టింగ్​యాప్ కొనుగోలు చేసి, బాల్ టూ బాల్​బెట్టింగ్​నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారంతో హిమాయత్ నగర్  స్ట్రీట్ నంబర్ 8లోని ఓ అపార్ట్​మెంట్ లో పోలీసులు దాడి చేసి, ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. రూ.1.20 లక్షల నగదు, బెట్టింగ్ యాప్ ఇన్​స్టాల్​చేసిన మూడు సెల్ ఫోన్లు స్వాధీనం 
చేసుకున్నారు.