హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భారత క్రికెట్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నడ్డాకు పుష్గగుచ్ఛం అందించారు. తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. రాజకీయ నాయకులనే కాకుండా సినీ స్టార్స్ పై కూడా ఫోకస్ పెట్టింది. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా.. స్టార్ హీరో ఎన్టీఆర్ తో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది.
Former cricketer Mithali Raj meets BJP national president JP Nadda in Hyderabad, Telangana. pic.twitter.com/WuvbdA4L9y
— ANI (@ANI) August 27, 2022
ఈ చర్చ కొనసాగుతుండగానే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వరంగల్ పర్యటన కోసం వస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. మిథాలీ రాజ్ ను కలిశారు. ఇవాళ సాయంత్రం శంషాబాద్లోని నోవాటెల్ హోటల్ లో హీరో నితిన్ తో సాయంత్రం సమావేశం కానున్నారు.