గుజరాత్ లో ఘోరం జరిగింది. అహ్మదాబాద్లో ఉద్యోగుల మధ్య జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ జీఎస్టీ ఉద్యోగి వసంత్ రాథోడ్ (34) గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఒక్కసారిగా అతను కిందపడిపోవడంతో తోటి ఆటగాళ్ళు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. వసంత్ రాథోడ్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గుజరాత్లో 10 రోజులలోపు ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోది. ఒక వారం క్రితం రాజ్కోట్ లో 27 ఏళ్ల ప్రశాంత్ భరోలియా, సూరత్ లో 31 ఏళ్ల జిగ్నేష్ చౌహాన్ గుండెపోటుతో మరణించారు.