నేరస్తుల గుర్తింపునకు ఐరిస్ టెక్నాలజీ

నేరస్తుల గుర్తింపునకు ఐరిస్ టెక్నాలజీ
  • నేరస్తుల గుర్తింపునకు ఐరిస్ టెక్నాలజీ
  • దేశంలోనే తొలిసారి తెలంగాణలో అమలు
  • వరంగల్ కమిషనరేట్​లో తొమ్మిది స్టేషన్ల ఎంపిక 
  • సిబ్బందికి ఏఎంఎఫ్​పీఐ సిస్టమ్ పరికరాల అందజేత 

హనుమకొండ, వెలుగు: నేరాలకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఆటోమేటెడ్ మల్టీమోడల్ ఫింగర్​ప్రింట్​ఐడెంటిఫికేషన్​ సిస్టమ్ ను అమలు చేస్తున్నారు. కొత్త టెక్నాలజీలో భాగంగా నిందితుల వేలిముద్రలతో పాటు ఐరిస్, ముఖం, పాద ముద్రలను కూడా సేకరించి భద్రపరుస్తారు. 

చోరీలు, హత్యలు, ఇతర ఘటనలు  జరిగినప్పుడు కచ్చితంగా నేరస్తులను గుర్తించేందుకు టెక్నాలజీ ఉపయోగపడనుంది. దీన్ని తెలంగాణ ఫింగర్​ప్రింట్​విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. మొదట హైదరాబాద్​కమిషనరేట్ లో రెండు, సిద్దిపేట, వరంగల్ కమిషనరేట్ లోని హనుమకొండ స్టేషన్లలో పైలట్​ప్రాజెక్టుగా అమలు చేశారు. అది సక్సెస్​కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలుకు శ్రీకారం చుట్టారు. 

వరంగల్ కమిషనరేట్​పరిధిలో ఫస్ట్​ఫేజ్ లో తొమ్మిది స్టేషన్లలో కొత్త టెక్నాలజీ పరికరాలను ఇన్​స్టాల్​ చేయనున్నారు.  సెంట్రల్ జోన్​ పరిధిలో 6, ఈస్ట్ జోన్ లో రెండు, వెస్ట్ జోన్​ లో ఒక స్టేషన్​ లో అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. తెలంగాణ ఫింగర్ ప్రింట్ విభాగం మంజూరు చేసిన పరికరాలను వరంగల్ సీపీ సన్​ప్రీత్ సింగ్ కమిషనరేట్ ఫింగర్​ప్రింట్​సిబ్బందికి అందజేశారు.

 నేరస్తులను పట్టుకోవడంలో ఫింగర్​ప్రింట్ విభాగంతో పాటు ఏఎంఎఫ్​పీఐ సిస్టమ్ కీలకంగా పని చేస్తున్నందని చెప్పారు. వరంగల్ కమిషనరేట్​సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలిపారు. వరంగల్‌ కమిషనరేట్‌ ఫింగర్‌ ప్రింట్‌ఇన్ స్పెక్టర్లు రాజ్‌కుమార్‌, శ్రీధర్‌, రాజశేఖర్‌ తదితరులు ఉన్నారు.