హైదరాబాద్ : పత్తిపంట నష్టపోయిందని ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది. వికారాబాద్ జిల్లాకు చెందిన రైతు మొగలప్ప సోమవారం గన్పార్క్ వద్ద ఆత్మహత్యాయత్నం చేయడంతో పక్కనే ఉన్న కానిస్టేబుల్ అడ్డుకున్నాడు. వికారాబాద్ జిల్లా, బషీర్బాద్ మండలం, ఎక్మయి గ్రామానికి చెందిన మొగలప్ప తనకున్న వ్యవసాయ పొలంలో వరి, పత్తి, కంది పంటలు వేశాడు.
అయితే ఇటీవల కురిసిన వర్షాలకు వరి , పత్తి , కంది పూర్తిగా దెబ్బతినడంతో మనస్థాపం చెందిన రైతు ఆత్మహత్యహత్నం చేశాడని తెలిపారు పోలీసులు. రూ .3 లక్షల అప్పుచేసి పంటలు సాగుచేసినట్లు రైతు మొగలప్ప తెలిపాడు. తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నా స్పందించట్లేదని కన్నీరుమున్నీరయ్యాడు రైతు మొగలప్ప.