మెదక్ చర్చిలో భక్తుల సందడి

మెదక్ చర్చిలో భక్తుల సందడి

మెదక్​టౌన్, వెలుగు: మెదక్​చర్చికి ఆదివారం భక్తులు ఎక్కువ సంఖ్యలోనే తరలివచ్చారు. ఉదయం శిలువ ఊరేగింపు నిర్వహించగా మధ్యాహ్నం చర్చి ప్రెసిబిటరీ ఇన్​చార్జి శాంతయ్య  దైవసందేశాన్ని అందించారు. అనంతరం చర్చి ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా పలువురు చర్చి కమిటీ సభ్యులు సువార్త ప్రకటన వినిపించారు. చర్చి కమిటీ సభ్యుల గీతాలాపనలు పలువురిని ఆకట్టుకున్నాయి. 

దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గోల్​బంగ్లా వెళ్లే రోడ్డులో చెట్ల కింద వంటలు చేసుకున్నారు. మెదక్​ చర్చికి మెదక్​ జిల్లాతో పాటు హైదరాబాద్​, రంగారెడ్డి, నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాలే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర వంటి దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో కమిటీ మెంబర్లు, సంఘస్తులు పాల్గొన్నారు.