జూ. పంచాయతీ సెక్రటరీలను చర్చలకు పిలిచేది లేదు: సీఎస్

జూ. పంచాయతీ సెక్రటరీలను చర్చలకు పిలిచేది లేదు: సీఎస్

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల(JPS) సమ్మెపై  తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను సమ్మెకు పిలిచేది లేదని సీఎస్ శాంతకుమారి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆమె.. ఈ సందర్భంగా  విధుల్లో ఉన్నవారి జాబితాను  మే 13 మధ్యాహ్నం 12 గంటల లోపు  పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.

జేపీఎస్ లు సమ్మె విరమించి విధుల్లో చేరొచ్చని.. లేకపోతే   సమ్మె విరమించని వారితో ప్రభుత్వంతో  ఎలాంటి సంబంధం ఉండదని హెచ్చరించారు.  విధులకు హాజరుకాని వారిస్థానంలో  తాత్కాలిక కార్యదర్శులను నియమించాలని సూచించారు. గతంలో జేపీఎస్ పరీక్ష రాసిన వారికి ఈ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.  లేదా రిజర్వేషన్ల ప్రతిపాదికన విధుల్లోకి తీసుకోవాలని సూచించారు.

ఉద్యోగ భద్రత కల్పించాలని మాండ్ చేస్తు  జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన సమ్మె రాష్ట్రవ్యాప్తంగా 15వ రోజుకు చేరుకుంది.  గత 15 రోజులుగా విధులు బహిష్కరించిన జేపీఎస్​లు కలెక్టరేట్లు, మండల పరిషత్‌ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టారు.