మెదక్ పట్టణంలోని జీజీహెచ్ లో సీటీ స్కాన్ మెషీన్ ప్రారంభం

మెదక్ పట్టణంలోని జీజీహెచ్ లో సీటీ స్కాన్ మెషీన్ ప్రారంభం

మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలోని జీజీహెచ్​లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​రావు అన్నారు. ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన సీటీ స్కాన్​మెషీన్​ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదివరకు సీటీ స్కానింగ్ మెషీన్​లేకపోవడంతో చాలామంది పేషెంట్లు ప్రైవేట్ హాస్పిటల్స్​కు వెళ్లి రూ.వేలల్లో ఖర్చు చేశారన్నారు. 

ఇకపై  ఆ సమస్య ఉండదని, ఈ మెషీన్​ను మెదక్ పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హాస్పిటల్​సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, డీసీహెచ్ డాక్టర్​శివదయాల్, డాక్టర్​ఏసీ.శేఖర్​ పాల్గొన్నారు.