డిసెంబర్ 29న కరెన్సీ నగర్‌‌‌‌‌‌ రిలీజ్

డిసెంబర్ 29న కరెన్సీ నగర్‌‌‌‌‌‌ రిలీజ్

యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్ ప్రధాన పాత్రల్లో వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కరెన్సీ నగర్‌‌‌‌‌‌’. ముక్కాముల అప్పారావు, డా కోడూరు గోపాల కృష్ణ నిర్మిస్తున్నారు.

ఆంతాలజీ థ్రిల్లర్‌‌‌‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 29న థియేటర్స్‌‌లో రిలీజ్ కాబోతోంది. ‘డబ్బుకు మనిషికి ఉన్న సంబంధాన్ని తెలియజేసేలా నాలుగు విభిన్న కథలతో ఈ సినిమా తీశామని, అన్ని వర్గాల ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా ఉంటుందని దర్శకనిర్మాతలు తెలియజేశారు.