కొండాపూర్, వెలుగు: ఎప్పుడూ వందల్లో వచ్చే కరెంట్ బిల్లు.. లక్షల్లో రావడంతో షాక్ తిన్న ఓ బాధితుడు దవాఖాన పాలయ్యాడు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మహ్మదాపూర్ గ్రామానికి చెందిన వడ్ల భాస్కర్చారికి మే నెలకు సంబంధించిన కరెంట్ బిల్లు రూ.6 ,93,833 కట్టాలని మెసేజ్ వచ్చింది. ఇది చూసి షాక్ తిన్న భాస్కర్ కు కళ్లు తిరిగాయి.
వెంటనే దవాఖానాకు వెళ్లడంతో సమస్య తెలుసుకున్న డాక్టర్..‘టెన్షన్పడడంతోనే ఇలా జరిగింది’ అని చెప్పి ట్రీట్మెంట్ఇచ్చి పంపించాడు. విద్యుత్శాఖ ఏఈకి కంప్లయింట్ఇవ్వాలని సూచించడంతో ఏఈ సిద్దేశ్వర్కు ఫిర్యాదు చేశాడు. తన ఇంటికి ఏప్రిల్లో రూ.1,322 బిల్లు వస్తే మే నెల బిల్లు రూ.6 ,93,833 వచ్చిందని వాపోయాడు. టెక్నికల్ సమస్యతో అలా వచ్చి ఉంటుందని, పరిశీలించి సరిచేస్తామని ఏఈ హామీ ఇచ్చారు.
