ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు తప్పిన భారీ ముప్పు

ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు తప్పిన భారీ ముప్పు

కమలాపూర్, వెలుగు: ఆర్టీసీ బస్సుపై కరెంట్​పోల్​విరిగిపడింది. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. హనుమకొండ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జమ్మికుంట నుంచి కమలాపూర్​ మండలం ఉప్పల్​ వైపు 35 మంది ప్రయాణికులతో వెళ్తోంది. ఉప్పల్​ నుంచి భీంపల్లి​మధ్య మెయిన్​రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నాయి. రోడ్డు పనుల కారణంగా కొంతకాలం క్రితమే కరెంట్​ పోల్స్​వంగిపోయి ప్రమాదకరంగా మారాయి.  స్థానికులు సంబంధిత శాఖ ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోలేదు. పల్లె వెలుగు బస్సు ఉప్పల్​క్రాస్​రోడ్డు దగ్గర కరెంట్​పోల్​ను తాకుతూ వెళ్లింది. దీంతో పోల్​విరిగి బస్సుపై పడింది. అక్కడున్నవారు విద్యుత్​సబ్​స్టేషన్​కు ఫోన్​ చేసి చెప్పడంతో సరఫరా నిలిపివేశారు. వెంటనే బస్సు డ్రైవర్, కండకర్ట్​​ ప్రయాణికులను దించేయడంతో ప్రమాదం తప్పింది