‘కేరళ లక్కీ డ్రా’ పేరుతో సైబర్ మోసం

‘కేరళ లక్కీ డ్రా’ పేరుతో సైబర్ మోసం

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం ఊరు రామకృష్ణాపూర్​కు చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్​లో ‘కేరళ లక్కీ డ్రా’ పేరుతో వచ్చిన వీడియో చూసి మోసపోయాడు. మందమర్రి ఎస్సై రాజశేఖర్​ తెలిపిన వివరాల ప్రకారం.. యూట్యూబ్‌లో వీడియో చూసి రూ.20 ఫోన్‌పే ద్వారా చెల్లించి లాటరీ టికెట్ కొన్నాడు.

అనంతరం బాధితుడి వాట్సాప్​కు రూ.5లక్షలు గెలుచుకున్నావని, ప్రాసెస్  ఫీజు కింద రూ. 4,999 చెల్లించాలని సూచించారు. ఇలా ఆరు విడతలుగా రూ. 56,299 చెల్లించాడు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.