హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్ మూఠా అరెస్ట్

హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్ మూఠా అరెస్ట్

హైదరాబాద్ లో డ్రగ్స్ రాకెట్ మూఠాను అరెస్ట్ చేశామన్నారు సైబరాబాద్  సీపీ  స్టీఫెన్ రవీంద్ర. 50 గ్రాముల MDMA , 45 కేజీల  గాంజాను స్వాధీనం  చేసుకున్నామని  తెలిపారు. మరో కేసులో ఐదు గ్రాముల MDMAను సీజ్ చేశామన్నారు.  ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 132 డ్రగ్స్ కేసుల్లో  257 మందిని  అరెస్ట్ చేశామన్నారు. 8 మందిపై  పీడీ యాక్ట్  నమోదు చేశామన్నారు. RBL  ఫేక్ కాల్స్  పేరుతో  మోసాలకు పాల్పడుతున్న  ముఠాని అదుపులోకి తీసుకున్నామని  చెప్పారు. మొత్తం  23 మందిలో  16 మంది అరెస్ట్ చేసామని,  ఏడుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.