శివాజీ…మళ్లీ 11న విచారణకు రండి

శివాజీ…మళ్లీ 11న విచారణకు రండి

అలంద మీడియా కేసులో హీరో శివాజీని..ఈనెల 11లోపు విచారణకు హాజరు కావాలని సైబరాబాద్  పోలీసులు ఆదేశించారు. గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న శివాజీని..ఇవాళ ఉదయం శంషాబాద్  విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకొని..సైబర్  క్రైమ్  పోలీస్  స్టేషన్ కు తరలించారు. అక్కడే శివాజీకి విచారణ నోటీసులు అందించారు సీసీఎస్ పోలీసులు.

టీవీ-9లో అక్రమాలకు పాల్పడినట్లు కొత్త యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో.. ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాశ్, శివాజీపై పోలీసులు కేసులు పెట్టారు. అప్పటి నుంచి  శివాజీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శివాజీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. శివాజీపై లుక్ అవుట్ నోటీసు ఉండటంతో… పోలీసులకు ఇమ్మిగ్రేషన్ అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో విదేశాలకు వెళ్తుండగా ఇవాళ శంషాబాద్ ఎయిర్ పోర్టులో శివాజీని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.