హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించారు. మార్చి 25న ఉదయం 6 గంటల నుంచి 26 ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి ఆదేశాలు జారీ చేశారు. హోలీ వేడుకల్లో పాల్గొనే వారు ఇతరులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని సిటీలో తిరిగే వాహనదారులపై రంగులు చల్లరాదన్నారు. వాహనాలపై పబ్లిక్ రోడ్స్ లో గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేయొద్దని సూచించారు.
శాంతి భద్రతలకు భంగం కలుగకుండా పండుగ సందర్భంగా షాపులు మూసివేయాలని వైన్స్నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మందు తాగి బహిరంగ ప్రదేశాల్లో గొడవలను సృష్టిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోలీ సందర్భంగా ప్రతి ఏటా సిటీలో వైన్స్ షాపులు ఓపెన్ చేసుకునేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం తెలిసిందే. మద్యం షాపులను మూసివేయాల్సిందిగా యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.
