
గచ్చిబౌలి, వెలుగు: ఇటీవల కాలంలో పిల్లలు ఆడుకునేందుకు పార్కింగ్చేసిన కార్లలోకి వెళ్లి ఊపిరాడక మృతి చెందిన సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి ప్రమాదాల నివారణకు సైబరాబాద్పోలీసుల పలు జాగ్రత్తలు సూచించారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే కార్లలో చిక్కుకున్న చిన్నారులను ప్రాణాలతో రక్షించగలమని పేర్కొన్నారు.
ఇవీ జాగ్రత్తలు..
- కారును లాక్ చేయడానికి ముందు వెనుక సీట్లను ఒకటికి రెండు సార్లు చెక్చేయాలి. పిల్లలు లేదా పెంపుడు జంతువులు లోపల ఉండకుండా చూడాలి.
- వాహనం చుట్టు పక్కల, వాహనం లోపల పిల్లలను ఒంటరిగా వదిలి వెళ్లకూడదు.
- కారు కీలు లేదా రిమోట్ లాకింగ్ డివైస్లను పిల్లల చేతులకు అందకుండా దూరంగా ఉంచాలి.
- రియల్ సీట్ రిమైండర్స్, చైల్డ్ డిటెక్షన్ సిస్టమ్స్ వంటి సేఫ్టీ అలర్ట్ లను అమర్చుకొని, ఇన్స్టాల్ చేయాలి. ఇవి కారులో పిల్లలు ఉండిపోతే హెచ్చరిస్తాయి.
- కారు విండోలకు బ్లాక్ ఫిల్మ్లు, హెవీ టింటెడ్ విండోస్ ఉపయోగించకూడదు. ఇలా చేస్తే వాహనాల్లో ఎవరు ఉన్నారో గుర్తించలేం.
- పిల్లలు కనిపించని సమయంలో సమీప వాహనాల్లో చెక్ చేయాలి.
- ఇవి ప్రతి ఒక్కరూ పాటించడమే కాకుండా తమ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలని పోలీసులు సూచిస్తున్నారు.