- తుఫాను ప్రభావం జలోర్, సిరోహి, బార్మర్ జిల్లాలపైనే ఎక్కువ
- 24 గంటల పాటు హై అలర్ట్: ఐఎండీ
జైపూర్/అహ్మదాబాద్: గుజరాత్ను వణికించిన బిపర్జాయ్ తుఫాన్.. ఇప్పుడు రాజస్థాన్పై ప్రతాపం చూపిస్తున్నది. దక్షిణ రాజస్థాన్, ఉత్తర గుజరాత్లోని పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్లోని జలోర్, సిరోహి, బార్మర్ జిల్లాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. తుఫాను అల్పపీడనంగా మారుతున్నది. పాలి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద నీటిలో చిక్కుకుపోయిన ఆరుగురిని ఎస్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది. బార్మర్ జిల్లాలోని నాలుగైదు చిన్న ఆనకట్టలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి.
పలుచోట్ల కుండపోత..
రాజస్థాన్లోని చాలా ఏరియాల్లో గడిచిన 24 గంటల్లో కుండపోత వర్షాలు కురిశాయని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. జలోర్లో 456 మిల్లీ మీటర్లు, మౌంట్అబులో 360, చితల్వానాలో 338, జస్వంతపురలో 332, రాణివాడలో 322, షేగంజ్లో 315, సమర్పూర్లో 270, రాణిలో 249 మి.మీ. వర్షపాతం రికార్డైందన్నారు. రానున్న 24 గంటల్లో ఈస్ట్, వెస్ట్ రాజస్థాన్, వెస్ట్ మధ్యప్రదేశ్లో మోస్తరు వర్షాలు పడ్తాయన్నారు.
గుజరాత్లో..
నార్త్ గుజరాత్లోని చాలా చోట్ల గడిచిన 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయని ఐఎండీ అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావం తగ్గుతున్నదని, సహాయక చర్యలు స్పీడప్ చేశారని వివరించారు. బనస్కాంత, పటాన్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లోని వేలాది మందిని సేఫ్ ప్లేసుకు తరలించామన్నారు. అమీర్గఢ్ మండలంలో ఆదివారం సాయం త్రం వరకు 206 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపింది. కచ్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. పోసినాలో 151, దంతివాడలో 150, పాలన్పూర్లో 136, రాధాపూర్లో 125 మిల్లీ మీటర్ల వర్షం నమోదైంది.