టోక్యో: ఒలింపిక్స్లో పాల్గొనేందుకు జపాన్ రాజధాని టోక్యోలో నిర్మించిన ఒలింపిక్ విలేజ్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు దక్షిణాఫ్రికా ఫుట్బాల్ ప్లేయర్లు, ఒక అనలిస్ట్కు వైరస్ సోకింది. ఒలింపిక్ విలేజ్లో ముందు జాగ్రత్తగా రోజువారీగా జరుగుతున్న టెస్టుల్లో మరో ప్లేయర్కు కరోనా పాజిటివ్ వచ్చిందని నిర్వాహకులు ప్రకటించారు. చెక్ రిపబ్లిక్ బీచ్ వాలీబాల్ ప్లేయర్ ఒన్డ్రెజ్ పెరుసిక్కు వైరస్ సోకింది. అతడికి ఎటువంటి సింప్టమ్స్ లేవని చెక్ రిపబ్లిక్ప్ ఒలింపిక్ టీమ్ హెచ్ మార్టిన్ దోక్టర్ తెలిపారు. టీమ్లో ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఒలింపిక్ విలేజ్లో కరోనా కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. ఒలింపిక్ విలేజ్ కాంప్లెక్స్లో మొత్తం 6700 మంది అథ్లెట్స్, అఫిషియల్స్ ఉన్నారు. వాస్తవానికి గత ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 23 నుంచి ఆగస్టు 8 వరకు ఒలింపిక్స్ జరగనున్నాయి. భారత్ నుంచి 119 మంది అథ్లెట్స్ ఈ ఒలింపిక్స్లో పాల్గొననున్నారు. మేనేజర్లు, టీమ్ అధికారులు సహా మొత్తం 228 మంది బృందం ఒలింపిక్ విలేజ్కు వెళ్తోంది. ఇందులో ఇప్పటికే రోయింగ్, షూటింగ్, బాక్సింగ్, సెయిలర్స్ టీమ్లు టోక్యో చేరుకున్నాయి.
ఒలింపిక్స్: బీచ్ వాలీబాల్ ప్లేయర్కు కరోనా
- ఆట
- July 19, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- IPL 2024: సన్ రైజర్స్ ఘోర ఓటమి..6 ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం
- పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టివేత
- తెలంగాణ కోసమే దేవుడు నన్ను పుట్టించిండు:కేసీఆర్
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
- జగన్ కోసం జనంలోకి భారతి..
- బర్గర్ ఒకరి ప్రాణం తీసింది.. మరొకరిని జైలుకు పంపింది..
- కాంగ్రెస్ లేకుండా చేయాలనుకుండు.. కేసీఆరే ఖతం అయ్యిండు: రాజగోపాల్ రెడ్డి
- IPL 2024: పటిదార్, కోహ్లీ మెరుపులు.. సన్ రైజర్స్ ముందు భారీ లక్ష్యం
- ఓట్ల కోసమే బీజేపీ తలంబ్రాల రాజకీయం: పొన్నం ప్రభాకర్
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు