
హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యశాఖ మంత్రిగా దామో దర రాజనర్సింహ గురువారం ఉదయం సెక్రటేరియట్లో బాధ్యతలు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ లిమిట్ను రూ.5 లక్షల నుంచి రూ.పది లక్షలకు పెంచే ఫైల్పై మంత్రిగా ఆయన తొలి సంతకం చేశారు. అలాగే, ప్రభుత్వ దవాఖాన్లలో ఖాళీగా ఉన్న 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్పై మంత్రి రెండో సంతకం చేశారు.
పోస్టుల భర్తీ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులను ఆదేశించారు. ఎర్రగడ్డలోని మెంటల్ హెల్త్ ఇనిస్టిట్యూట్స్లో వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మరో ఫైల్పై మంత్రి సంతకం చేశారు.