
నిజామాబాద్, వెలుగు: విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా పీహెచ్డీ చేస్తున్న మైనార్టీ స్టూడెంట్స్ సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం ఈనెల 30 వరకు ఆన్లైన్లో (www.telanganaepass.cgg.gov.in??) అప్లికేషన్లు పంపాలని జిల్లా ఇన్చార్జి మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ డి.రమేశ్బుధవారం తెలిపారు.
జూలై 31 వరకు కలెక్టరేట్లోని రూమ్ నంబర్ 221లో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు అడ్మిషన్లు పొందిన ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైనులు, బుద్దిస్ట్, పార్సీ మైనార్టీ స్టూడెంట్స్ అర్హులన్నారు. సందేహాలుంటే 9700351736 సంప్రదించవచ్చని తెలిపారు.