
సర్కారు బడికి వచ్చే విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు. వర్ధన్నపేట మున్సిపాలిటీ కోనాపురం వార్డులోని ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్నా నలుగురు విద్యార్థులు మాత్రమే స్కూల్కు హాజరవుతున్నారు. ఉపాధ్యాయుడు ఐదు కిలో మీటర్ల దూరం నుంచి సైకిల్పై వచ్చి బోధన చేస్తున్నాడు.
ఇదే మండలంలోని దివిటిపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో 14 మంది విద్యార్థులు మాత్రమే వస్తుండగా, ఇద్దరు టీచర్లు పాఠాలు చెబుతున్నారు. ఇదే స్కూల్లో అంగన్వాడీ కేంద్రం కూడా నడపడంతో విద్యార్థులను ఒకే గదిలో ఉంచి బోధన చేస్తున్నారు.
– వర్ధన్నపేట, వెలుగు