
రోజురోజుకు పెరిగిపోతున్న టెక్నాలజీని అడ్డుపెట్టుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. లింక్లు, ఓటీపీలు పంపి కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు. మరికొందరు ఫోన్లకు ప్రమాదకరమైన మాల్వేర్లను పంపి వ్యక్తిగత డేటా, ఇతర వివరాలను కొట్టేసి జేబులు ఖాళీ చేస్తున్నారు. ఇంకొందరు హ్యాకర్లు వినియోగదారులకు ఎలాంటి డౌట్ రాకుండా గూగుల్ ప్లే స్టోర్లో నకిలీ యాపులను సృష్టించి వాటి ద్వారా యూజర్ల ఫోన్లలోకి మాల్వేర్ పంపి సమాచారాన్ని దొంగిలిస్తున్నారు.
ఈ క్రమంలో ఆండ్రాయిడ్ యూజర్లకు సైబర్ సెక్యూరిటీ సంస్థ సీఆర్ఐఎల్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ ఉపయోగిస్తే జాగ్రత్తగా ఉండాలని.. లేదంటే మీ పర్సనల్, ఫైనాన్షియల్ డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. సీఆర్ఐఎల్ తాజా నివేదిక ప్రకారం.. గూగుల్ ప్లే స్టోర్లోని 20 హానికరమైన యాప్లు స్మార్ట్ఫోన్ వినియోగదారులకు తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని గుర్తించినట్లు తెలిపింది.
ALSO READ | IPO News: డబ్బులు ఎవరికీ ఊరకే రావు.. అందుకే ఐపీవోకి వస్తున్న లలితా జ్యువెలరీ
ఈ నకిలీ యాప్లు వినియోగదారుల సున్నితమైన సమాచారాన్ని దొంగలిస్తున్నాయని.. ఈ యాప్లు మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసి ఉంటే వెంటనే వాటిని తొలగించాలని సీఆర్ఐఎల్ అప్రమత్తం చేసింది. ఒక వినియోగదారు యాప్ను డౌన్లోడ్ చేసిన తర్వాత అది వారి 12- పదాల రికవరీ పాస్ వర్డ్ను నమోదు చేయమని అడుగుతుంది. ఆపై వినియోగదారు వాలెట్కు యాక్సెస్ పొందడానికి సైబర్ నేరస్థులు ఆ పాస్ వర్డ్ను ఉపయోగించుకుంటారని సీఆర్ఐఎల్ వెల్లడించింది.
సైబర్ నేరస్థులు ఈ హానికరమైన యాప్లను ఎక్కువగా గేమింగ్, వీడియో ఎడిటింగ్ సాధనాలకు లింక్ చేయబడిన డెవలపర్ ఖాతాలను ఉపయోగించి అప్లోడ్ చేస్తున్నారు. ఈ యాప్లు తమ గోప్యతా విధానాలలో ఫిషింగ్ యూఆర్ఎల్ను దాచిపెడతాయి. తద్వారా వినియోగదారులు సున్నితమైన సమాచారాన్ని నమోదు చేసేలా మోసగిస్తాయి. కాబట్టి.. ఆ యాప్లు మీ ఫోన్లలో ఉంటే వెంటనే తొలగించడని సీఆర్ఐఎల్ హెచ్చరించింది.
ప్రమాదకరమైన యాప్స్:
Suiet వాలెట్
బుల్ఎక్స్ క్రిప్టో
సుషీస్వాప్
రేడియం
హైపర్లిక్విడ్
ఓపెన్ ఓషన్ ఎక్స్ఛేంజ్
పాన్కేక్ మార్పిడి
మెటియోరా ఎక్స్ఛేంజ్
హార్వెస్ట్ ఫైనాన్స్ బ్లాగ్